Smart City News logo

విశాఖ జిల్లా నరవలో కూటమి రాజకీయాల్లో విభేదాలు.

Aug 25, 2026 2:27 16 views 3

Description

చోటా నేతల మధ్య విభేదాలపై ఎమ్మెల్యే రమేష్‌బాబు సీరియస్..! విశాఖ జిల్లా నరవలో కూటమి రాజకీయాల్లో విభేదాలు బహిర్గతమయ్యాయి. సుమారు కోటి రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కూటమి నేతల మధ్య కొనసాగుతున్న విభేదాలపై ఎమ్మెల్యే రమేష్‌బాబు తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా టీడీపీ నేతలు, మాజీ కార్పొరేటర్ మొల్లి ముత్యాలనాయుడిని ఉద్దేశించి రాజకీయ విభేదాలతో కూటమి పరువు తీయొద్దంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో, స్థానికంగా పోటీ చేయాలనుకుంటున్న నేతల మధ్య ఆధిపత్య పోరు పెరుగుతోందని, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ కూటమికి నష్టం కలిగించొద్దని ఎమ్మెల్యే హెచ్చరించారు. అభివృద్ధి కార్యక్రమాల వేదికగా.. కూటమి నేతల మధ్య విభేదాలపై ఎమ్మెల్యే క్లాస్ తీసుకోవడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.

Related Videos