Smart City: బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ పార్టీ ఆఫీసులో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. నిన్న జరిగిన జగన్ పై దాడికి నిరసనగా ఈరోజు వైసీపీ పశ్చిమం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఆఫీసులో నిరసన కార్యక్రమం. ఆయన మీడియాతో మాట్లాడుతూ..
ప్రజాస్వామ్యంలో ఏదైతే స్వేచ్ఛగా ప్రజలు ప్రచారం చేసుకునే హక్కు ని ఈరోజు తెలుగుదేశం పార్టీ తప్పుతో పట్టించింది. జగన్మోహన్ రెడ్డి ని భౌతికంగా దెబ్బతీయడానికి తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుందని., ఎవరు ఎన్ని కుట్రలు పన్నిన  జగన్  ప్రజల మనిషి కావున ప్రజల ఆశీస్సులు తమని కాపాడతాయని, మీడియా ముఖంగా తెలియపరిచారు. ఆయన ప్రజల మధ్యకు వచ్చి ప్రజలతో మమేకం కావడానికి ప్రయత్నిస్తుంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆయన మీద భౌతికంగా దాడి చేయడం అమానుషం అని ఈ సందర్భంగా తెలియపరిచారు.
			156
			
				            
			
			        
    
                        previous post
                    
                    
                        